అన్నమయ్య కీర్తన పలుకు తేనెల తల్లి
రాగం: సాళంగనాట /కర్నాటక దేవగాంధారి 28 హరికాంభోజి జన్య ఆ: స గ3 మ1 ప ని2 స అవ: స ని2 ద2 ప మ1 గ3 రి2 స తాళం: ఖండ చాపు పల్లవి పలుకు దేనెల తల్లి పవళించెను । కలికి తనముల విభుని గలసినది గాన ॥ (ప)(2.5) చరణం 1 నిగనిగని మోముపై నెఱులు గెలకుల జెదర పగలైన దాక జెలి పవళించెను । (2) తెగని పరిణతులతో తెల్లవారినదాక (2) జగదేక పతి మనసు జట్టి గొనె గాన ॥ పలుకు దేనెల తల్లి పవళించెను (ప..) చరణం 2 కొంగు జారిన మెఱుగు గుబ్బ లొలయగ దరుణి బంగారు మేడపై బవళించెను । (2) చెంగలువ కనుగొనల సింగారములు దొలక (2) అంగజ గురునితోడ నలసినదిగాన ॥ పలుకు దేనెల తల్లి పవళించెను (ప..) చరణం 3 నటనతో ముత్యాల మలగుపై పరవశంబున దరుణి పవళించెను । (2) తిరు వేంకటాచలా ధిపుని కౌగిట గలసి (2) అరవిరై నును జెమలు నంటినదిగాన ॥ పలుకు దేనెల తల్లి పవళించెను । కలికి తనముల విభుని గలసినది గాన ॥ (ప)(2.5)
Browse Related Categories: